
ఘట్కేసర్, వెలుగు: దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు యువకులను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివారలను సీఐ పందిరి పరుశురాం సోమవారం వెల్లడించారు. జనగామకు చెందిన దస్తగిరి, సాయి నిఖిల్గత నెల30న అశోక్లీలాండ్వాహనంలో కూరగాయలు తీసుకొచ్చి బోయినపల్లి మార్కెట్లో అన్లోడ్ చేశారు.
తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడ సమీపంలో టాయిలెట్ కోసం ఆగారు. ఈ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారిని బెదిరించి రూ.4 వేల నగదు, రూ.5 వేలు పేటీఎం ద్వారా వసూలు చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఘట్కేసర్ప్రాంతానికి చెందిన జవహర్, పత్తి రాజు, బంగారు శ్రావణ్ నిందితులుగా గుర్తించి, రిమాండ్కు తరలించారు.