Hyderabad: దారి దోపిడీ దొంగలు అరెస్ట్

Hyderabad: దారి దోపిడీ దొంగలు అరెస్ట్

ఘట్​కేసర్, వెలుగు: దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు యువకులను ఘట్​కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివారలను సీఐ పందిరి పరుశురాం సోమవారం వెల్లడించారు. జనగామకు చెందిన దస్తగిరి, సాయి నిఖిల్​గత నెల30న అశోక్​లీలాండ్​వాహనంలో కూరగాయలు తీసుకొచ్చి బోయినపల్లి మార్కెట్​లో అన్​లోడ్​ చేశారు. 

తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి ఘట్​కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడ సమీపంలో టాయిలెట్ కోసం ఆగారు. ఈ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారిని బెదిరించి రూ.4 వేల నగదు, రూ.5 వేలు పేటీఎం ద్వారా వసూలు చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఘట్​కేసర్​ప్రాంతానికి చెందిన జవహర్, పత్తి రాజు, బంగారు శ్రావణ్ నిందితులుగా గుర్తించి, రిమాండ్​కు తరలించారు.