ఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ నుంచి తన ఆఫీస్ వరకు సైకిల్ పై వచ్చారు. కరోనాతో జనం కష్టాల్లో ఉంటే…. పెరుగుతున్న ధరలతో సామాన్యులపై మరింత భారం పడుతోందన్నారు వాద్రా. ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు.