సీసీ పుటేజీతో దొరికిన దొంగలు

సీసీ పుటేజీతో దొరికిన దొంగలు

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట మైత్రివనంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రామేశ్వర్ వివరాలు వెల్లడించారు. మైత్రివనానికి చెందిన వెల్దండ రాజు ఇంట్లో గత నెల 20వ తేదీన 7 తులాల బంగారం, రూ.6.50 లక్షల నగదు దొంగతనానికి గురైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో దొంగలను గుర్తించారు. వరంగల్ కు చెందిన శెట్టి విజయ్ , శెట్టి మణి, శెట్టి సూర్య, శెట్టి శివ అనే నలుగురు చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన నగలను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ప్రత్యేక పోలీసుల బృందం సోమవారం వారిని అదుపులోకి తీసుకుంది. జగిత్యాల, మంచిర్యాల, ఖమ్మం , వైరా, నిజామాబాద్, వరంగల్ లో కూడా ఈ నలుగురు నేరాలకు పాల్పడినట్లు ఏసీపీ చెప్పా రు. నిందితులను పట్టుకున్న స్పెషల్ టీమ్ ను సీపీ జోయల్ డేవిస్ అభినందించారు.