
ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. కివీస్పై రెండు సిక్సర్లు కొట్టడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఈ వన్డేలో రోహిత్ శర్మ 24 బంతుల్లో 34 పరుగుల చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. అయితే ఈ రెండు సిక్సర్లతో వన్డే క్రికెట్లో భారతీయ గడ్డపై అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. భారత గడ్డపై వన్డేల్లో రోహిత్ శర్మ 125 సిక్సర్లు కొట్టగా.. మహేంద్ర సింగ్ ధోని 123 సిక్సర్లు బాదాడు. భారత్లో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ మాత్రమే 100కు పైగా సిక్సర్లు కొట్టారు. రోహిత్, ధోని తర్వాత 71 సిక్సర్లతో సచిన్ టెండూల్కర్ మూడో స్తానంలో..66 సిక్సర్లతో నాల్గో ప్లేస్లో విరాట్ కోహ్లీ, 65 సిక్సర్లతో యువరాజ్ సింగ్ ఐదో స్థానంలో ఉన్నారు.
వరల్డ్ వైడ్గా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మొదటి ప్లేస్లో ఉన్నాడు. అతను 398 వన్డేల్లో 351 సిక్సర్లు బాదాడు. 331 సిక్సర్లతో క్రిస్ గేల్ రెండో స్థానంలో, 270 సిక్సర్లతో జయసూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ 239 వన్డేల్లో 265 సిక్సర్లు కొట్టి నాలుగవ స్థానంలో ఉన్నాడు.
ఉప్పల్ వన్డే ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 16వ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతను ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ను దాటేశాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 232 వన్డేల్లో ఇన్నింగ్స్లలో 48.63 సగటు, 89.60 స్ట్రైక్ రేట్తో 9,630 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.