మలక్పేటలో రాయల్ ఓక్ స్టోర్ ప్రారంభం

మలక్పేటలో రాయల్ ఓక్ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు : ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్  ఫర్నిచర్, హైదరాబాద్‌‌లోని మలక్ పేట లో తమ స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌ను సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌  విజయ్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియం,  మేనేజింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌   మదన్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియం, రిటైల్ హెడ్ హెచ్ ఎస్ సురేష్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ హెడ్ ప్రద్యుమ్న కరణం ప్రారంభించారు. దాదాపు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్​లో విస్తృత  శ్రేణిలో  లివింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌, బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌, డైనింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌  మరెన్నో వాటికి తగిన ఫర్నిచర్ అందుబాటులో ఉంటుంది. 

సోఫాలు, రిక్లైనర్స్‌‌‌‌‌‌‌‌, డైనింగ్‌‌‌‌‌‌‌‌  టేబుల్స్ , మ్యాట్రెసెస్‌‌‌‌‌‌‌‌,  బెడ్స్‌‌‌‌‌‌‌‌ను కొనుక్కోవచ్చు. ఈ  స్టోర్ ప్రారంభంతో హైదరాబాద్ లో  రాయల్ ఓక్  మొత్తం స్టోర్స్ సంఖ్య 19కి చేరింది. ఈ స్టోర్ ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికిపైగా విజిటర్లను ఆకర్షించే అవకాశం ఉందని విజయ్‌‌‌‌‌‌‌‌ సుబ్రమణియం అన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా  ఎంపిక చేసిన “కంట్రీ కలెక్షన్‌‌‌‌‌‌‌‌” కూడా లభిస్తుందని అన్నారు. అమెరికా, ఇటలీ, వియత్నాం, టర్కీ, జర్మనీ, మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఫర్నిచర్​ను కూడా అమ్ముతామని విజయ్​ పేర్కొన్నారు.