జపాన్ లో ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి

జపాన్ లో ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి

‘ఆర్ఆర్ఆర్’ మూవీ జపాన్ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. జపాన్ గడ్డపై భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు చేరుకున్నారు. జపాన్ మీడియాతో  సమావేశమయ్యారు. సినిమాతో పాటు ఇతరత్రా విషయాలను వారితో పంచుకున్నారు. జక్కన్న టీం జపాన్ లో పర్యటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారక్, చరణ్ లకు జపాన్ లో కూడా అభిమానులు భారీ సంఖ్యలో ఉండడంతో విజయం సాధించడం పక్కా అని చిత్ర బృందం భావిస్తోంది. 

దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని భావిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. కొమరం భీం పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మొర్రీస్, సముద్ర ఖనిలు కీలక పాత్రలు పోషించారు.