హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో కూడా మాస్కులు ధరించాలని సూచించింది. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. అటు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న 459 కేసులు రాాగా ఒక్క హైదరాబాద్ లోనే 232 కేసులు వచ్చాయి.
Dear All. When the cases are rising mask wearing is must. I urge all to wear the mask in public places including metro rail. There is a fine of Rs.1000/- for non compliance please.
— Dr G Srinivasa Rao (@drgsrao) June 29, 2022