నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా కింద రూ.310 కోట్లు జమ

నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా కింద రూ.310 కోట్లు జమ

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో పంటలు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయంగా సోమవారం నాటికి రూ.310.43 కోట్లు జమయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం రైతుల సంఖ్య 2,98,510 కాగా వారికి రైతు భరోసా కింద రూ.326.07 కోట్లు అవసరమని వివరించారు. అందులో ఇప్పటి వరకు 2,68,056 మంది రైతులకు భరోసా సొమ్ము అందిందన్నారు. సోమవారం 4,643 మంది అన్నదాతలకు రూ.22.65 కోట్లు జమయ్యాయన్నారు.