శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.41కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.41కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జనవరి 21వ తేదీ ఆదివారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో జాంబియా నుండి హైదరాబాద్ కి వచ్చిన ఓ మహిళా ప్యాసింజర్ దగ్గర భారీగా మత్తు పదార్థాలు గుర్తించారు అధికారులు. మహిళ హ్యాండ్ బ్యాగ్ తో పాటు, సూట్ కేస్ , డాక్యుమెంట్ ఫోల్డర్ లో డ్రగ్స్ ను దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన మహిళ అధికారులకు పట్టుబడింది.

సౌత్ ఆఫ్రికాకు చెందిన యువతిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితురాలి నుంచి 5.93 కేజీల హెరాయిన్  ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్ లో దాదాపు రూ.41కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నట్లు తెలిపారు.