సినిమాలు, టీవీ, ఓటీటీ ద్వారా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం

సినిమాలు, టీవీ, ఓటీటీ ద్వారా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: సినిమా, ఓటీటీ, టీవీ ఇండస్ట్రీలు గత ఏడాది (2024) రూ. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయి. ఈ రంగాల ద్వారా దాదాపు 26 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. డెలాయిట్​తో కలిసి మోషన్​ పిక్చర్​ అసోసియేషన్​(ఎంపీఏ) తయారు చేసిన రిపోర్టు ఈ విషయాలను వెల్లడించింది. 

ముంబైలో జరుగుతున్న వరల్డ్​ ఆడియో విజువల్​ ఎంటర్​టైన్​మెంట్​సమిట్​(వేవ్స్​)లో దీనిని విడుదల చేసింది. ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడటానికి, టీవీ కార్యక్రమాలు చూడటానికి  ఓటీటీ ప్లాట్‌‌ఫారమ్‌‌లలో కంటెంట్‌‌ను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో ఈ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది.

2029 నాటికి ఎంటర్​టైన్​మెంట్​సెక్టార్​39 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని రిపోర్టు వెల్లడించింది. రాబోయే నాలుగేళ్లలో ఇండస్ట్రీ ప్రతి ఏటా ఆరు నుంచి ఏడు శాతం గ్రోత్​ సాధించే అవకాశం ఉందని ఎంపీఏ చైర్మన్​ చార్లెస్​ రిక్విన్​ చెప్పారు. 2029 నాటికి ఇండస్ట్రీ ఆదాయం రూ.1.65 లక్షల కోట్లకు చేరుతుందని వివరించారు.