శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టబుడింది. జనవరి 12వ తేదీ శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.6కోట్ల విలువైన డైమండ్స్ తోపాటు భారీగా విదేశీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
చాక్లెట్ వెపర్స్లో డైమండ్స్ పెట్టి తరలించేందుకు ప్రయత్నించిన నిందితులను అధికారులు ఆదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.