కెమెరాలకు రంగేసి, గ్యాస్కట్టర్తో కట్చేసి ఏటీఎంలో రూ.6 లక్షలు చోరీ
కుంట్లూర్లో ఏటీఎం కొల్లగొట్టిన దొంగలు
కొన్ని నెలల క్రితం ఆదిబట్ల పీఎస్లో ఇదే తరహా చోరీ
నార్త్ఇండియా ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు నాలుగు టీంలతో వేట
హయత్ నగర్, వెలుగు: హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులోని గవర్నమెంట్డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న యాక్సిస్ ఏటీఎంలో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు గ్యాస్ కట్టర్తో మెషిన్ను కట్ చేసి అందులోని రూ.6లక్షలు ఎత్తుకెళ్లారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం..మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో ఏటీఎం లో రూ.5లక్షలు ఫిల్ చేసి వెళ్లారు. అంతకుముందే అందులో లక్షకు పైగా క్యాష్ ఉంది.
రాత్రి 1:59 నిమిషాలకు ఓ వ్యక్తి రూ.200 డ్రా చేశాడు. ఆ తర్వాత 2గంటల నుండి ఉదయం 4గంటల మధ్య ఈ చోరీ జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చోరీ..సీసీ కెమెరాల్లో రికార్డ్అవ్వకుండా అవ్వకుండ మెషిన్కు ఉన్న కెమెరాకు, రూంలో కెమెరాకు కలర్ వేశారు. తర్వాత కనెక్షన్ కట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కోసం 4 టీంలను ఏర్పాటు చేశారు. కొన్ని నెలల క్రితం ఆదిబట్ల పీఎస్పరిధిలో ఇదే తరహా చోరీ జరిగింది. ఈ కేసులో హర్యాణాకు చెందిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ దొంగతనం కూడా ఉత్తరాది ముఠా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. డబ్బులను పెట్టిన తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దొంగతనం జరగడంతో అందులోని సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.