
- ఆర్ఎస్ ప్రవీణ్ యాత్ర
- 100 రోజుల చొప్పున మూడు విడతలుగా టూర్
హైదరాబాద్, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్మాయావతి బర్త్డే అయిన జనవరి 15న ఉమ్మడి వరంగల్జిల్లా నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. సర్దార్సర్వాయి పాపన్నగౌడ్పుట్టిన ఊరైన ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి టూర్ స్టార్ట్ చేయనున్నారు. 100 రోజుల చొప్పున మూడు విడతలుగా మొత్తం 300 రోజులపాటు ప్రవీణ్ టూర్ కొనసాగనుంది. తొలిదశలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో యాత్ర చేస్తారు. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో ఈ టూర్ కొనసాగనున్నట్లు బీఎస్పీ వర్గాలు తెలిపాయి. టూర్ పూర్తయ్యాకహైదరాబాద్లో 10 లక్షల మంది బహుజనులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నాయి. జనవరి 15 కల్లా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు కనీసం 1,500–2,000 చొప్పున మొత్తం రెండు లక్షల మెంబర్షిప్ చేయించాలనే లక్ష్యంతో కేడర్పని చేస్తోందని ఆర్ఎస్పీ సెక్రటరీ మల్లికార్జున్ తెలిపారు.