హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో నిబంధనలను పాటించని ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నగరంలోని సెంట్రల్జోన్పరిధిలో 5 బస్సులు రిఫ్టెక్టివ్టేప్స్డ్యామేజ్, బస్సు రంగుల ఆల్ట్రేషన్ల కారణంగా కేసులు నమోదు చేశారు. వీరిపై రూ. 25 వేలు జరిమానా విధించారు. అలాగే ఈస్ట్జోన్ పరిధిలో కమర్షియల్గూడ్స్తరలిస్తుండడం, ఫస్ట్ఎయిడ్బాక్స్లేక పోవడం, డ్రైవర్యూనిఫారం లేని కారణంగా 2 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 8 వేల జరిమానా విధించారు.
వెస్ట్జోన్పరిధిలో కమర్షియల్గూడ్స్తరలిస్తున్న, ఫైర్సేఫ్టీ లేని 3 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.15 వేల జరిమానా విధించారు. నార్త్జోన్పరిధిలో కమర్షియల్గూడ్స్తరలింపు, యూనిఫారం లేని 10 బస్సులపై కేసు నమోదు, రూ. 20వేల జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కమర్షియల్ గూడ్స్తరలింపు, ఫస్ట్ఎయిడ్ కిట్ లేక పోవడం, యూనిఫారం లేని కారణంగా 10 బస్సులపై కేసులు నమోదు చేసి 38 వేల జరిమానా విధించారు.
గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ బస్సుల తనిఖీల్లో ఇప్పటి వరకూ 244 కేసులు నమోదు కాగా రూ.6.11 లక్షల జరిమానా రూపంలో వసూలు చేశారు. అలాగే 9 బస్సులను సీజ్ చేశారు. తాజాగా శుక్రవారం బెంగళూరు రూట్లో ఓ బస్సులో ఎమెర్జెన్సీ డోర్ను లాక్ చేసిన విషయాన్న గుర్తించి నిర్వాహకులను మందలించారు.
