
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి ఆర్టీఏ ఆఫీస్లో గురువారం నిర్వహించిన ఫ్యాన్సీ కార్ల నంబర్ల వేలానికి విశేష స్పందన లభించింది. మొత్తం 15 నంబర్లకు వేలం నిర్వహించగా, రూ. 34.17 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో కేవలం మూడు నంబర్లకు మాత్రమే ఏకంగా రూ. 28.88 లక్షల ఆదాయం వచ్చింది.
టీజీ 08ఏసీ 0006 నంబర్ను లాడియా డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 20.07 లక్షలకు దక్కించుకుంది. టీజీ 08క్యూ 9999 నంబర్ను రత్నదీప్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.6.80 లక్షలకు సొంతం చేసుకుంది. టీజీ 08ఏసీ 0001 నంబర్ను శ్రీశిక్ష ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ. 2.01 లక్షలకు కొనుగోలు చేసింది.