ఓవర్ లోడ్.. మూడు వాహనాలపై కేసు.. ఒక లారీ సీజ్

ఓవర్ లోడ్.. మూడు వాహనాలపై కేసు.. ఒక లారీ సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓవర్​లోడ్​తోపాటు అతివేగంగా వెళ్లే వాహనాల తనిఖీని ఆర్టీఏ అధికారులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా నాలోల్​ వద్ద అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 20 టన్నుల డస్ట్​ను తీసుకు వెళ్తున్న ఓ లారీని అధికారులు సీజ్​ చేశారు. అలాగే 13 టన్నులతో వెళ్తున్న వాహనం, 9 టన్నుల స్టీల్​ను తీసుకెళ్తున్న వాహనాన్ని కూడా అధికారులు సీజ్​చేసినట్టు తెలిపారు. గత నెల 1న నుంచి కొనసాగుతున్న వాహనాల తనిఖీల్లో ఇప్పటి వరకూ 1381 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిపై 6.40 కోట్ల కాంపౌండింగ్​ ఫీజు వసూలు చేసినట్టు తెలిపారు. అలాగే టాక్సులు చెల్లించని వాహనాల నుంచి 27.70 కోట్లు వెరసి మొత్తం 34.10 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.