సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండల కేంద్రం వద్ద జాతీయ రహదారిపై కూలి పనులకు వెళ్తున్న ఆటోని మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా..12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మోతె మండలం బుర్కచర్లలో మిరప కూలీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు మునగాల మండలం రామసముద్రానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.