తెలంగాణలోని పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలోని పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతమూడు రోజులుగా తెలంగాణతోపాటు ఏపీలో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువుల్లా తలపిస్తున్నాయి.తెలంగాణ, ఏపీల్లో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చెరువులు, కుంటలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

ఈ రోజు (బుధవారం,ఆగస్టు 13) తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి , ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ , యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. 

ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాదద్, జనగాం, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

జగిత్యాల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల , వనపర్తి జిల్లా్లలో అక్కడడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ లోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.