వికారాబాద్ నుంచి ధారూర్ క్రిస్టియన్ మిషనరీ జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో 5మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 20మందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.
వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు దాదాపు 80మంది ప్రయాణికులతో వికారాబాద్ నుంచి ధారూర్ క్రిస్టియన్ జాతరకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న స్వరూప (37) అనే మహిళ మృతి చెందింది. ఆమెను సికింద్రాబాద్ రసూల్ పూర్ ఇంద్రానగర్ నివాసిగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చేవెళ్ళ ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.