ఆందోళన చేసిన కొద్దిసేపటికే.. గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ఆందోళన చేసిన కొద్దిసేపటికే.. గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ఆసిఫాబాద్, వెలుగు :  ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆసిఫాబాద్​ డిపో  ఎదుట  జరిగిన ధర్నాలో పాల్గొన్న  సేఫ్టీ  డ్రైవింగ్  ఇన్​స్పెక్టర్(ఎస్డీఐ)  బూసి బాపు(50) గుండెపోటుతో మృతిచెందారు. పొద్దున డిపో గేటు ముందు తోటి కార్మికులతో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.  

అక్కడి డాక్టర్లు కాగజ్ నగర్ కు రెఫర్ చేయగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయాడు. ఆసిఫాబాద్​పట్టణంలోని బ్రాహ్మణవాడ కాలనీలో ఉంటున్న బాపునకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.