ఆసిఫాబాద్, వెలుగు : ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆసిఫాబాద్ డిపో ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్(ఎస్డీఐ) బూసి బాపు(50) గుండెపోటుతో మృతిచెందారు. పొద్దున డిపో గేటు ముందు తోటి కార్మికులతో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.
అక్కడి డాక్టర్లు కాగజ్ నగర్ కు రెఫర్ చేయగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయాడు. ఆసిఫాబాద్పట్టణంలోని బ్రాహ్మణవాడ కాలనీలో ఉంటున్న బాపునకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.