డీజిల్ పొదుపు ఉద్యోగుల సామాజిక బాధ్యత : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

డీజిల్ పొదుపు ఉద్యోగుల సామాజిక బాధ్యత : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: డీజిల్  పొదుపు చేయడాన్ని ఉద్యోగులు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. డీజిల్​ను ఆదా చేస్తూనే మైలేజీ పెంచుకునేందుకు సాంకేతిక పద్దతులను పాటించాలని సూచించారు.

శుక్రవారం బస్ భవన్​లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘ డీజిల్‌‌‌‌ నిర్వహణ..అవగాహన సదస్సు” కు ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంధన సంక్షోభం, నిరంతరం పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో ప్రతీ డ్రైవర్ ఇంధన పొదుపుపై దృష్టిపెడితే సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లవచ్చాన్నారు.