శభాష్.. రాములు.. డ్రైవర్​కి సజ్జనార్​ అభినందనలు

శభాష్.. రాములు.. డ్రైవర్​కి సజ్జనార్​ అభినందనలు
  • మహిళ ప్రాణాలు కాపాడిన డ్రైవర్​కు సజ్జనార్ అభినందనలు

హైదరాబాద్, వెలుగు : సమయస్పూర్తితో ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్‌పల్లి డిపో డ్రైవర్‌ పి.రాములును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు.  డ్రైవర్‌ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచిందని  శుక్రవారం ట్వీట్  చేశారు. 

గురువారం మెట్‌పల్లిలో జగిత్యాల వైపు వెళ్తున్న బస్‌  కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించగా, బస్‌  డ్రైవర్‌  రాములు గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును ఆపడంతో ఆ మహిళకు ప్రాణాప్రాయం తప్పిందని ఎండీ తెలిపారు. ఈ వీడియోను ఎండీ ట్విటర్​లో పోస్టు చేశారు.