V6 News

ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

హనుమకొండ సిటీ/ జయశంకర్​భూపాలపల్లి/ హసన్​పర్తి, వెలుగు: ఆర్టీసీ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కార్మికులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు.

హనుమకొండ బస్​డిపో వద్ద మహిళా కాంగ్రెస్​జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయగా, హసన్​పర్తి మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు, కుడా చైర్మన్​ ఇనగాల వెంకట్రామ్​రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్​డిపో, అంబేద్కర్​ సెంటర్​ వద్ద నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.