దగ్గు, జలుబు ఉన్నోళ్లకు ఆర్టీపీసీఆర్

దగ్గు, జలుబు ఉన్నోళ్లకు ఆర్టీపీసీఆర్

హైదరాబాద్​, వెలుగు: దగ్లు, జలుబు వంటి లక్షణాలున్న ఇన్​ప్లూయెంజా బాధితులకు ఆర్టీపీసీఆర్ ​టెస్టు చేయాలని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు శ్వాస సమస్యలున్నోళ్ల శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ ​విధానంలో నిర్ధారించాలని పబ్లిక్​హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్​ సెంటర్, బస్తీ దవాఖాన్లు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్​ ఆస్పత్రులకు ఈ లక్షణాలతో ఓపీకి వస్తే కరోనా టెస్టు చేయాల్సిందేనన్నారు.  ఇతర దేశాల నుంచి వస్తున్నోళ్లలో 2 శాతం మంది నుంచి శాంపిల్స్​ తీసి ఆర్టీపీసీఆర్ చేయాలన్నారు. ఆశాలు, ఏఎన్​ఎంలు ఇంటింటికి తిరిగి  కరోనా లక్షణాలు ఉన్నోళ్లందరినీ టెస్టులకు పంపాలన్నారు.