- అధికార పార్టీ లీడర్ల అనధికార భూదందా
- పార్టీషన్లకు నిరాకరించిన సబ్రిజిస్టార్తో గొడవ
- ఆయన లీవ్లో ఉన్నప్పుడు ఇన్చార్జితో 39 రిజిస్ట్రేషన్స్
- రూ.లక్షల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రాత్రికి రాత్రి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూలింగ్ పార్టీ లీడర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి రూల్స్కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్, నాలా కన్వర్షన్, లే అవుట్ పర్మిషన్లు లేని వెంచర్లలో నిబంధనలను పట్టించుకోకుండా పార్టీషన్లు చేశారు. సబ్ రిజిస్ర్టార్ లీవ్లో ఉండగా.. ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్ మంగళవారం రాత్రి పది గంటల వరకు గుట్టుచప్పుడు ఈ వ్యవహారం నడిపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ లీడర్లు నిలదీయడంతో.. ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్ రిజిస్ర్టేషన్లు నిలిపివేసి వెళ్లిపోయారు. దీనిపై కలెక్టర్తో పాటు సంబంధిత ఆఫీసర్లకు కంప్లైంట్ చేసేందుకు ప్రతిపక్ష లీడర్లు సిద్ధమవుతున్నారు.
అంతా ప్లాన్ ప్రకారమే...
అధికార పార్టీకి చెందిన లీడర్లు పక్కా ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి వరకు ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్తో రిజిస్ర్టేషన్లు చేయించినట్లు అపోజిషన్ లీడర్లు ఆరోపిస్తున్నారు. గతంలో వీటి రిజిస్ర్టేషన్లపై రెగ్యులర్ సబ్ రిజిస్ర్టార్ ఇక్బాల్కు, రూలింగ్ పార్టీకి చెందిన రియల్టర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో పార్టీషన్లు చేస్తున్నారని, మీరు ఎందుకు చేయరని రియల్టర్లు సబ్ రిజిస్ర్టార్ను నిలదీశారు. ఎంత ప్రెజర్ చేసినా ఆయన వారికి లొంగలేదు. రూల్స్కు అగెనెస్ట్గా రిజిస్ర్టేషన్లు చేయనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆయన లీవ్లో ఉండడంతో మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ రతన్ ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్గా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు ఉత్కూర్ శివారులోని 270ఏ, 272/ఏ1తో పాటు మరో నాలుగు సర్వే నంబర్లకు సంబంధించి అరవైకి పైగా డాక్యుమెంట్లను రెడీ చేశారు. రాత్రి పది గంటల వరకు అందులో 39 డాక్యుమెంట్లకు సంబంధించిన పార్టీషన్ రిజిస్ర్టేషన్లు పూర్తి చేశారు. మరో 25 డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్దపడగా.. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీల లీడర్లు వెళ్లి అడ్డుకున్నారు. గతంలో రోజుకు నాలుగైదు రిజిస్ర్టేషన్లు మాత్రమే జరిగేవి. కానీ ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్ ఆధ్వర్యంలో ఒకే రోజు ఏకంగా అరవై డాక్యుమెంట్లు సిద్ధం చేసి అందులో 39 రిజిస్ర్టేషన్లు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్టు, ఒక్కో డాక్యుమెంట్కు రూ.15వేల చొప్పున వంద రిజిస్ర్టేషన్లు చేసేందుకు వారిమధ్య ఒప్పందం కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా కన్వర్షన్, లే అవుట్ పర్మిషన్లు లేని వెంచర్లకు పార్టీషన్లు చేయాలని లీడర్లు సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాకముందు వెలిసిన వెంచర్లు కావడంతో రియల్టర్లు ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు. ఏడాదినుంచి ఎటూ తోచని స్థితిలో ఉన్నవాళ్లంతా ప్లాన్ ప్రకారం ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్తో పనిచేయించుకునేందుకు సిద్దపడ్డారు.
రూల్స్కు అగెనెస్ట్గా చేయనని చెప్పా...
రూల్స్కు అగెనెస్ట్గా ఎలాంటి రిజిస్ర్టేషన్లు చేయనని చెప్పాను. ధరణిలో డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలేతప్ప పార్టీషన్లు చేయడానికి పర్మిషన్లేదు. అది కూడా ఎల్ఆర్ఎస్ కట్టినవాటికే చేయాలి. మున్సిపల్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉన్నవాటికి కాదు. నేను లీవ్లో ఉన్నా. ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్ ఎట్ల చేశారో తెలియదు.
‑ ఇక్బాల్, సబ్ రిస్ట్రార్, లక్షెట్టిపేట
డిస్ర్టిక్ట్ రిజిస్ట్రార్ ఆదేశాలతోనే చేశాను..
బుధవారం నుంచి లాక్డౌన్ ఉండడంతో డిస్ర్టిక్ట్ రిజిస్ర్టార్ ఆదేశాలతోనే మంగళవారం రాత్రి వరకు ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు చేశాను. నాలా కన్వర్షన్ లేకున్నా గజాల చొప్పున పార్టీషన్లు చేయమని జిల్లా రిజిస్ర్టార్ చెప్పారు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఏమీ లేదు.
- రతన్, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, లక్సెట్టిపేట
అక్రమ రిజిస్ట్రేషన్లు క్యాన్సల్ చేయాలి
రూలింగ్ పార్టీకి చెందిన రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ర్టేషన్లు చేయడానికి వారికి ఆఫీసర్లు పూర్తిగా సహకరించారు. ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్ అత్యుత్సాహంతో రాత్రి పది గంటల వరకు రిజిస్ర్టేషన్లు చేశారంటేనే ఇందులో అక్రమాలు జరిగినట్టు అర్థమవుతోంది. దొంగచాటుగా జరిగిన 39 రిజిస్ర్టేషన్లను క్యాన్సల్ చేయాలి.
‑ ఆరిఫ్, హరిగోపాల్, దొండ ప్రభాకర్, అపోజిషన్ పార్టీల లీడర్లు