ముంబై: సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం మూవీ లవర్స్కు ఎప్పుడూ ఉంటుంది. అయితే సెలబ్రిటీలు మాత్రం తమ పర్సనల్ లైఫ్ విషయాలను సీక్రెట్గా ఉంచడానికే ఇష్టపడతారు. కానీ వారికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా టాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించిన ఓ గాసిప్ బాగా వైరల్ అవుతోంది. హిందీ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడుపుతున్నట్లు ఏడాది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఆమె ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.
కానీ గతేడాది బాంద్రాలోని సిద్ధార్థ్ ఇంటికి వెళ్తూ కియారా కెమెరాలకు దొరికిన విజువల్స్ నెట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరోమారు వీరి ప్రేమాయణం బయటపడింది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఇంటికి ప్రియుడ్ని వెంటేసుకొని కియారా వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం కరణ్ తన కవలలు యశ్, రూహిల బర్త్డే పార్టీ చేశాడు. ఈ ఈవెంట్కు సిద్ధార్థ్, కియారాకు కూడా ఆహ్వానం అందింది. దీంతో వీరు జంటగా వెళ్లారు. పార్టీ తర్వాత ఒకే కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్లో అడుగు పెట్టిన కియారా.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామతో మరోమారు తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ సరసన మరోమారు నటించే చాన్స్ను కియారా కొట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీకి వంశీ పైడిపల్లి డైరెక్షన్ వహించనున్నట్లు సమాచారం. దీంతోపాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి ప్రాజెక్ట్లోనూ కియారా యాక్ట్ చేయనుందని తెలుస్తోంది. ఈ రెండు మూవీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
Rumoured lovebirds @SidMalhotra and @advani_kiara snapped post @karanjohar's bash for his twins #KiaraAdvani https://t.co/VuxDwDclzu
— ETimes (@etimes) February 8, 2021