పిరికివాళ్లకు కాంగ్రెస్‌లో చోటు లేదు.. ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లిపోండి

పిరికివాళ్లకు కాంగ్రెస్‌లో చోటు లేదు.. ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లిపోండి

న్యూఢిల్లీ: పిరికివాళ్లకు కాంగ్రెస్‌లో చోటు లేదని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. భయపడేవాళ్లు ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లిపోవాలని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు భయం లేని లీడర్ల అవసరం ఉందని పార్టీ సోషల్ మీడియా టీమ్‌తో మాటల్లో రాహుల్ పేర్కొన్నారు. 

‘దేనికీ భయపడని చాలా మంది నేతలు కాంగ్రెస్‌కు బయట ఉన్నారు. అలాంటి వారిని మనం పార్టీలోకి తీసుకురావాలి. అదే టైమ్‌లో మన పార్టీలో కొంత మంది భయపడే నాయకులు ఉన్నారనే విషయాన్ని గమనించాలి. భయపడే వారిని కాంగ్రెస్‌లో నుంచి తీసేయాలి. అలాంటి వాళ్లు ఆర్ఎస్ఎస్ వైపు వెళ్లిపోండి. మీరు మాకొద్దు. మీలాంటి పిరికివాళ్ల అవసరం మాకు లేదు. మాకు భయపడని నేతలు కావాలి. ఇదే మా సిద్ధాంతం. ఇదే నా ప్రాథమిక సందేశం’ అని రాహుల్ పేర్కొన్నారు.