రన్నింగ్ కారులో మంటలు.. సుచిత్రలో ఘటన

రన్నింగ్ కారులో మంటలు.. సుచిత్రలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: రన్నింగ్​కారులో మంటలు చెలరేగిన ఘటన సుచిత్ర అంగడిపేటకు కొద్ది దూరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి నాగార్జున డ్రీమ్​ల్యాండ్ లో నివాసం ఉండే హుస్సేన్ బిరిదర్ ఆదివారం రాత్రి కారులో పెద్ద అంబర్​పేట్ వెళ్తున్నాడు. 

సుచిత్ర అంగడిపేట వద్ద బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. తర్వాత కొద్ది దూరం వెళ్లగానే కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. హుస్సేన్​వెంటనే కిందికి దిగాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.