
- పట్టించుకోని ఆఫీసర్లు.. స్టూడెంట్స్కు తప్పని తిప్పలు
- రూర్బన్ స్కీం కింద రూ.2 కోట్లతో అదనపు గదుల నిర్మాణం
- బిల్లులు రాక హ్యాండోవర్ చేయని కాంట్రాక్టర్లు
- దిక్కులేని సమస్యల మధ్యే కొనసాగుతున్న చదువులు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఆయా స్కూళ్లలో కోట్ల రూపాయలు పెట్టి కొత్త బిల్డింగ్లు కట్టినా పాఠాలు మాత్రం పాత గదుల్లోనే కొనసాగుతున్నాయి. శ్యాం ప్రసాద్ రూర్బన్ మిషన్ స్కీమ్ కింద అదనపు గదులు నిర్మించినా వాటి బిల్లులు పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఆఫీసర్లకు హ్యాండోవర్ చేయలేదు. ఫలితంగా పాత సమస్యల మధ్యే చదువులు కొనసాగుతున్నాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్కు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్, పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని కుర్తివాడ, లింగాయిపల్లి చీకొడ్, పాపన్నపేట గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ బిల్డింగ్ లు శిథిలావస్థకు చేరాయి. వర్షం పడితే ఉరుస్తున్నాయి. ఈ హైస్కూళ్లలో ఇంగ్లీష్, తెలుగు మీడియంలో కలిపి 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నవారి సంఖ్య చూస్తే పాపన్నపేటలో 597 మంది, కుర్తివాడలో 240 మంది, లింగాయపల్లి చీకోడ్ లో 397 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్కు సరిపడ తరగతి గదులు లేకపోవడంతోపాటు ఉన్న బిల్డింగ్స్ అధ్వానంగా మారాయి. ఈ నేపథ్యంలో శ్యాంప్రసాద్ రూర్బన్ మిషన్ స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో స్కూళ్లకు అడిషనల్క్లాస్ రూమ్స్ నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. కుర్తివాడలో ఒక్కోక్కటి రూ.10 లక్షల చొప్పున మూడు అదనపు తరగతి గదులు, రూ.35 లక్షలతో రెండు అదనపు గదులు, సైన్స్ ల్యాబ్, టాయిలెట్స్ శాంక్షన్ అయ్యాయి. వీటిలో ఐదు క్లాస్ రూమ్లు, సైన్స్ ల్యాబ్ నిర్మాణం పూర్తి అయ్యింది. స్థలం సమస్య కారణంగా నాలుగు టాయిటెట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. లింగాయిపల్లి చీకోడ్ జడ్పీ హైస్కూల్కోసం ఒక్కోక్కటి రూ.10 లక్షల చొప్పున మూడు క్లాస్రూమ్స్, రూ.21 లక్షలతో ఒక క్లాస్ రూమ్బిల్డింగ్, సైన్స్ల్యాబ్, రెండు టాయిలెట్లు శాంక్షన్ అయ్యాయి. వీటిలో రెండు క్లాస్రూమ్స్ పూర్తయ్యాయి. సైన్స్ల్యాబ్ బిల్డింగ్రూఫ్ లెవల్వరకు పూర్తయింది. పాపన్నపేట జడ్పీ హైస్కూల్ కోసం ఒక్కోక్కటి రూ.10 లక్షల చొప్పున నాలుగు అడిషనల్క్లాస్ రూమ్స్, రూ.47 లక్షలతో నాలుగు అడిషనల్ క్లాస్ రూమ్స్, సైన్స్ల్యాబ్ బిల్డింగ్ శాంక్షన్అయ్యింది. అన్ని క్లాస్రూమ్ బిల్డింగ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కొంత మేర ఫ్లోరింగ్, పేయింటింగ్ పని పెండింగ్ లో ఉంది.
బిల్లులు రాకపోవడంతో..
రూర్బన్స్కీం కింద బిల్డింగ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తి స్థాయిలో పేమెంట్ కాకపోవడంతో వారు వాటిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు హ్యాండోవర్ చేయలేదు. మూడు చోట్ల దాదాపు ఏడాది కాలంగా ఇదే పరిస్థితి ఉంది. స్టూడెంట్స్, టీచర్స్ఇబ్బందులు పడుతున్నా ఈ బిల్డింగ్ల పెండింగ్బిల్లులు రిలీజ్చేయించి, వాటిని వినియోగంలోకి తేవడంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా బిల్లులు రిలీజ్చేయించి అదనపు గదులను స్టూడెంట్స్ కు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
కొత్త బిల్డింగ్ ఓపెన్ చేయాలి
కొత్త బిల్డింగ్ కట్టడంతో మా ఇబ్బందులు పోతాయనుకున్నాం. కానీ పాత బిల్డింగ్లోనే క్లాస్లు నిర్వహిస్తున్నారు. వర్షాలకు ఉరుస్తున్నాయి. వెంటనే కొత్త బిల్డింగ్స్ఓపెన్ చేయించాలి.
- ఉజెర్, టెన్త్ క్లాస్స్టూడెంట్, జడ్పీహెచ్ఎస్, పాపన్నపేట
త్వరలో ప్రారంభిస్తాం..
మూడు గ్రామాల్లోని హైస్కూళ్లలో రూర్బన్ స్కీం కింద అదనపు గదులు, సైన్స్ ల్యాబ్స్నిర్మించాం. పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో వీటిని వినియోగంలోకి తీసుకొస్తాం.
- గోపాల్, పంచాయతీరాజ్ ఏఈ, పాపన్నపేట