శంషాబాద్, వెలుగు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్124 రుస్లాన్ ల్యాండయ్యింది. రుస్లాన్అంటే రష్యన్అని అర్థం.. దీన్ని సైనిక, వాణిజ్య అవసరాల కోసం తయారు చేశారు. మొదటిసారిగా1986లో సోవియట్ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశపెట్టారు. ఇలాంటి విమానాలు 55కి పైగా ఉన్నాయి. వీటిని అప్పట్లో సోవియెట్యూనియన్(ఉక్రెయిన్)లో తయారు చేసేవారు. యుద్ధం తర్వాత ఉత్పత్తి ఆగిపోయింది.
సైజులు చూస్తే ఔరా అనాల్సిందే..
ఈ విమానం ఎత్తు 20.78 మీటర్లు కాగా, పొడవు 69.10 మీటర్లు, వెడల్పు (వింగ్ స్పాన్) 73.3 మీటర్లు ఉంటుంది. నాలుగు లక్షల కిలోల బరువుతో టేకాఫ్అయ్యే సామర్థ్యం దీని సొంతం. గంటకు 750 కిలోమీటర్ల నుంచి 850 కి.మీ వరకు వెళ్లగలదు. గరిష్టంగా 150 టన్నుల లోడ్తో నాన్స్టాప్గా 14 వేల కిలోమీటర్లు ప్రయాణించగలగడం దీని స్పెషాలిటీ. ఈ విమానం వెనక ర్యాంప్లు 36.5 మీటర్లుండడం వల్ల భారీ మెషినరీని ఈజీగా లోడ్ చేయొచ్చు. ఇందులో సైనిక ట్యాంకులు, హెలీకాప్టర్లు, ఇతర భారీ సామగ్రి రవాణా చేయొచ్చు. దీంతో ఈ విమానానికి విపరీతమైన డిమాండ్ఉంది. ఇది బోయింగ్ సీ 17 గ్లోబ్మాస్టర్ 3 కంటే కూడా పెద్దది.ఆంటోనోవ్ ఏఎన్124 కంటే పెద్దదైన ఆంటోనోవ్ An-225 మ్రియా 2022లో రష్యా-–ఉక్రెయిన్ యుద్ధంలో ధ్వంసమైంది.
శంషాబాద్ ఎందుకు వచ్చినట్టు ?
ఈ విమానం ముందు శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ఎయిర్పోర్టుకు వచ్చింది. అక్కడి నుంచి గురువారం శంషాబాద్లో ల్యాండయ్యింది. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్నుంచి ఇతర దేశాలకు కార్గో రవాణా కోసం ఈ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది గత అక్టోబర్ 10న కూడా వచ్చింది. దీని ల్యాండింగ్తో శంషాబాద్ఎయిర్పోర్టుకు
కొత్తందం వచ్చింది.
