రైతులకు గుడ్ న్యూస్ ..రేపట్నుంచి రైతుబంధు పైసలు

రైతులకు  గుడ్ న్యూస్ ..రేపట్నుంచి  రైతుబంధు పైసలు

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  2023 జూన్  26 సోమవారం నుంచి  రైతుల ఖాతాల్లోకి రైతుబంధు ఆర్థిక సాయాన్ని జమ చేయనుంది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అందజేస్తామని  చెప్పారు. 

రైతుల ఖాతాల్లో మొత్తం.రూ.7 వేల720 కోట్లు జమకానున్నాయని   మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.  గతంతో పోలిస్తే ఈ సారి కొత్తగా 5లక్షల మంది లబ్ధిదారులు పెరగనున్నట్లుగా తెలిపారు. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున  ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది.