రైతు భరోసా డబ్బులు ఏఈవో అకౌంట్లోకి.. ఏఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

రైతు భరోసా డబ్బులు ఏఈవో అకౌంట్లోకి.. ఏఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లి ఏఈవో మౌనికను సస్పెండ్​చేస్తూ అగ్రికల్చర్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైతు భరోసా నిధుల మళ్లింపు వ్యవహారంలో ఈ చర్యలు తీసుకున్నారు.

రాజంపేట మండలం కొండాపూర్​ పరిధిలోని షేర్​శంకర్ తండాకు చెందిన రైతు కిషన్​కు 1.02 ఎకరాల భూమి ఉండగా కొంతకాలంగా రైతు భరోసా పైసలు రాకపోవటంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ డబ్బులు గతంలో కొండాపూర్​ఏఈవోగా పని చేసిన మౌనిక అకౌంట్​లో జమ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో మౌనికను సస్పెండ్​చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏఈవో అకౌంట్​లో జమైన పైసలను సదరు రైతుకు ఇవ్వనున్నట్లు అగ్రికల్చర్​ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి.