హైదరాబాద్: రన్ రాజా రన్, సాహో సినిమాలతో టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న సుజీత్, ప్రవళ్లిక ఎంగేజ్మెంట్ బుధవారం జరిగిందని తెలిసింది. లాక్డౌన్ గైడ్లైన్స్ కారణంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం జరిగిందని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఈవెంట్ ఫొటోల్లో వైట్ షేర్వానీలో సుజీత్ కనిపిస్తుండగా.. ప్రవల్లిక గ్రీన్, వెల్వెట్ సిల్క్ శారీ లుక్లో ఆకట్టుకుంది. ప్రవళ్లిక డెంటిస్ట్ అని సమాచారం.
సుజీత్, ప్రవళ్లిక పెళ్లి తేదీ, వేదికలను ఇరు కుటుంబాలు ఖరారు చేయాల్సి ఉంది. డేట్స్ నిర్ణయించాక అఫీషియల్గా ప్రకటిస్తారని తెలిసింది. రిపోర్టుల ప్రకారం సుజీత్, ప్రవళ్లిక గత కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసని సమాచారం. కాగా, మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ఫిల్మ్ను మెగాస్టార్ చిరంజీవి హీరోగా పట్టాలెక్కించే అవకాశాన్ని సుజీత్ దక్కించుకున్న విషయం తెలిసిందే.