ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి: సబిత

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి: సబిత

చేవెళ్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. గురువారం చేవెళ్లలోని ఓ గార్డెన్‌లో  నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయడంలో  విఫలమైందని ఆరోపించారు. 

బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. డీసీఎంఎస్​ చైర్మన్ పటోళ్ల కృష్ణారెడ్డి, పార్టీ చేవెళ్ల మాజీ ఇన్​చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, నాయకులు హన్మంత్​ రెడ్డి, శివప్రసాద్ తదితరులున్నారు.   

గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి

వికారాబాద్: ఇటీవల ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వికారాబాద్, మోమిన్​పేట మండలాల్లో బీఆర్ఎస్​మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను గురువారం సన్మానించారు. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దని, ఇబ్బందులు ఎదురైతే తాము అండగా ఉంటామన్నారు. 

బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్​మాజీ సభ్యుడు శుభప్రద్​పటేల్, జడ్పీ మాజీ వైస్​చైర్మన్​విజయ్​కుమార్​, నాయకులు నర్సింహారెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.