ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్ అధికారులు..

ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్ అధికారులు..

 సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. జనవరి 17వ తేదీ బుధవారం  లంచం తీసుకుంటూ ఆర్ఐ వెంకట రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల శర్మలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల శివ అనే వ్యక్తి ఇంటి నంబర్ కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. 

అయితే, లంచం ఇస్తేనే పని అయితదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. బాధితుడు నుంచి 10 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ వెంకట రావు, మరో ఉద్యోగి వేణుగోపాల శర్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.