రైల్వే ఉద్యోగులకు భద్రతా అవార్డులు

రైల్వే ఉద్యోగులకు భద్రతా అవార్డులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సికింద్రాబాద్​లోని రైల్​ నిలయంలో సోమవారం పలువురు ఉద్యోగులకు ‘ఎంప్లాయ్​ ఆఫ్​ ది మంత్’ భద్రతా అవార్డులు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్  11 మంది ఉద్యోగులకు ఈ అవార్డులను అందజేశారు. చురుకుతనం, అంకితభావంతో పనిచేసిన లోకో పైలట్లు, పాయింట్స్​ ఉమెన్​, గేట్​ మ్యాన్​, ట్రైన్​ మేనేజర్లకు ఈ అవార్డులు అందజేసినట్లు తెలిపారు. అంతకుముందు భద్రతపై సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్​ జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్​, డీఆర్​ఎంలు పాల్గొన్నారు.