Sai Durga Tej :అందుకే నా పేరు మార్చుకున్న..గాంజా శంకర్ క్యాన్సిల్పై సాయి ధరమ్ క్లారిటీ..

Sai Durga Tej :అందుకే నా పేరు మార్చుకున్న..గాంజా శంకర్ క్యాన్సిల్పై సాయి ధరమ్ క్లారిటీ..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) నటిస్తోన్న తాజా చిత్రం గాంజా శంకర్ (Gaanja Shankar). అయితే గత కొన్ని రోజుల నుంచి గాంజా శంకర్ మూవీ ఆగిపోయిందని, ఆ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..యాంటీ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ కంట్రోల్ పోలీసులు చిత్ర యూనిట్కి నోటీసులు ఇచ్చారనే ప్రచారం నడిచింది..ఇక ఇదే విషయంపై..తాజాగా సాయి ధరమ్ స్పందించాడు. 

లేటెస్ట్గా మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ గాంజా శంకర్ సినిమా ఆగిపోయినందునే వస్తున్న వార్తలపై అడగగా..సాయి ధరమ్ మాట్లాడాడు.'సినిమా ఆగిపోయిందనే విషయం మాత్రం కొన్ని వెబ్ సైట్స్లో వచ్చే ఆర్టికల్స్ చూసినంత వరకు నాకు తెలియదని చెప్పుకొచ్చాడు. 

అలాగే టైటిల్ కాంట్రవర్సీ అయిందనే న్యూస్ కూడా ఆర్టికల్స్ లోనే చూశానని.. మేకర్స్ నుంచి మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ లేదని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని మీడియా ద్వారానే వింటున్నానని, నాకు ఇంకా క్లారిటీ లేదని తేజ్ సెటైరికల్ గా రియాక్ట్ చెప్పాడు. అయితే తేజ్ చెప్పిన ప్రకారం చూసుకుంటే సినిమా సెట్స్ పైనే ఉందని విషయం అర్ధం అవుతోంది.

అలాగే సాయి ధరమ్ మ‌ళ్లీ తన పేరు మార్చుకున్నాడు. త‌న పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు వెల్లడించాడు. ఉమెన్స్ డే సంద‌ర్భంగా త‌న త‌ల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌ (Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉండాలనే ఉద్దేశంతో నా పేరులో దుర్గ ను జత చేసినట్లు అన్నారు. సర్ నేమ్ తో ఎలాగో మా నాన్న పేరు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇంత‌కుముందు కూడా సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న పేరు మార్చుకున్న విష‌యం తెలిసిందే. 

2021లో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి యాక్సిడెంట్ అయిన అనంత‌రం న్యూమరాలజీ ప్ర‌కారం సాయితేజ్ అని పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మ‌ళ్లీ మూడోసారి త‌న పేరును సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు తెలిపారు. 

ఇక గాంజా శంకర్ సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సాయి ధరమ్ నుండి వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.