తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది.
TDP వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల నుంచి ఆయన కుటుంబం YCP కి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సాయికృష్ణను SVBC ఛైర్మన్గా ఏపీ ప్రభుత్వం నియమించింది.
గతంలో SVBC ఛైర్మన్గా ఉన్న సినీనటుడు పృథ్వీరాజ్ ఆ పదవికి రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగినితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో పృథ్వీ రాజీనామా చేశారు.