నాగ చైతన్యతో నటించడానికి..సాయి పల్లవి, కీర్తి సురేష్ పోటీ?

నాగ చైతన్యతో నటించడానికి..సాయి పల్లవి, కీర్తి సురేష్ పోటీ?

హీరో నాగ చైతన్య(Nagachaitanya)..డైరెక్టర్ చందు మొండేటి(Chandumondeti) కాంబోలో ప్రేమమ్ మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మత్స్యకారుల జీవిత కథలు ఎలా ఉంటాయో చూపించడానికి ఈ క్రేజీ కాంబో రెడీ అవుతుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. ఈ స్టోరీలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుందని టాక్. అందుకోసం ఇప్పటికే మహానటి కీర్తిసురేష్(Keerthy Suresh)ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్టు వార్తలు రాగా.. లేటెస్ట్ గా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి(Saipallavi) పేరు వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ఎందుకంటే మత్స్యకారుల రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం చైతూ తన కసరత్తులు మొదలుపెట్టారు. వారు నిజ జీవితంలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారో తెలుసుకోవడానికి మత్స్యకారుల గ్రామాలకు నాగచైతన్య, చందూ మొండేటి వెళ్లారు. అందుకోసం సహజంగా యాక్ట్ చేసే హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్ అయితే ఈ మూవీకి సెట్ అవుతారనే ఆలోచనలో మేకర్స్ ఆలోచిస్తున్నారట. త్వరలో ఎవరో ఒకరు సెట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో చైతూ బోటు డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నట్టు టాక్. 

ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) పాన్ ఇండియా లెవెల్లో నిర్మించున్నారు. ఈ మూవీ కోసం మ్యూజిక్ సెన్సషన్ అనిరుధ్ రవిచందర్( Anirudh Ravichander) స్వరాలూ అందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా కార్తీకేయ 2 మూవీతో వంద కోట్ల క్లబ్  లో చేరిన డైరెక్టర్ చందు మొండేటి చైతన్యకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి మరి.