విజయవాడ సమీపంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

విజయవాడ సమీపంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

విజయవాడ: కృష్ణా జిల్లా రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం తలుపులు మూసివేశాక…  అర్థరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. షిర్డీ సాయిబాబా మందిరం ఆవరణలో బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఓ వైపు ఆలయాల్లో ఘటనలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపధ్యంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.