
లోక్ సభ ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పోలీస్ అధికారిణిపై వేటు పడింది. పాతబస్తీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్ ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై విచారణ చేపట్టిన సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉమాదేవి ఎన్నికల కోడ్ ఉల్లఘించరంటూ సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆచితూచి వ్యవహరించకపోతే వేటు తప్పదని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.