సింగపూర్‌‌‌‌‌‌‌‌లో భారత సంతతి మంత్రి జీతంలో కోత

సింగపూర్‌‌‌‌‌‌‌‌లో భారత సంతతి మంత్రి జీతంలో కోత

సింగపూర్‌‌‌‌‌‌‌‌: సింగపూర్‌‌‌‌‌‌‌‌ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ఎస్.ఈశ్వరన్ జీతంలో కోత పడింది. అవినీతి ఆరోపణలతో గత నెల అరెస్టయిన ఈశ్వరన్ ను సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ బుధవారం సస్పెండ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన జీతంలోనూ కోత(82%) విధించారు. 

ప్రస్తుతం ఆయన బెయిల్​పై బయటకు వచ్చారు. మంత్రిగా ఈశ్వరన్ నెలకు సుమారు రూ.34 లక్షలు(41 వేల డాలర్లు) కాగా, తాజా నిర్ణయంతో ప్రస్తుతం నెలకు రూ.5 లక్షలు(6300 డాలర్లు) అందుకోనున్నారు.