వైద్యానికి ముందు మనోధైర్యం కోసం.. సమంత ప్రత్యేక పూజలు

వైద్యానికి ముందు మనోధైర్యం కోసం.. సమంత ప్రత్యేక పూజలు

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ కు గ్యాప్ తీసుకొని మరీ ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే వ్యాధి నయమైదని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ గా మరో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు సమంతా. 

మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం మరో వారం రోజుల్లో అమెరికా వెళ్తున్నానని, ఈసారి ఎలాగైనా నయం అయ్యేదాకా వదలనని చెప్పికొచ్చారు. అయితే ఈ ట్రీట్మెంట్ కు ముందు సమంత మనోధైర్యం కోసం దైవ దర్శనాలకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆమె తాజాగా తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్‌(Golden temple)ను దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారని సమాచారం. ఇందుకు సంబందించిన ఫోటోలను అభిమానులంతో పంచుకున్నారు సామ్. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు.. సమంత త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషీ(Khushi) సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ(Shiva nirvana) దర్శకత్వలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత సమంత బాలీవుడ్ లో సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ చేస్తున్నారు. వరుణ్ ధావన్(Varun dhavan) హీరోగా చేస్తున్న ఈ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.