
సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల యేటిగట్టు’.రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘హనుమాన్’నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
120 షూటింగ్ రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, దాదాపు 75 శాతం షూట్ పూర్తయిందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మరో మూడు భారీ సెట్స్ను నిర్మిస్తున్నారు. తదుపరి షెడ్యూల్లో ఇవి కీలకమైన బ్యాక్డ్రాప్స్గా ఉండబోతున్నాయి.
#SambaralaYetiGattu 120 days of shoot completed with 75% of the filming wrapped ❤️🔥
— Primeshow Entertainment (@Primeshowtweets) May 28, 2025
3 massive sets are currently being erected for the upcoming MASSIVE ACTION SCHEDULE of #SYGMovie 🔥
Mega Supreme Hero @IamSaiDharamTej @rohithkp_dir @AishuL_ @IamJagguBhai @saikumaractor… pic.twitter.com/wtt9Q9Xpfj
వీటిలో కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. కెరీర్లో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ క్యారెక్టర్లో తేజ్ కనపించబోతున్నాడని, ఎమోషన్స్ పరంగానూ తన పాత్ర ఆశ్చర్యపరుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.