న్యూఢిల్లీ: ‘సంసద్ చలో’ నిరసనలపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జ్, దాడి ఘటనలను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తీవ్రంగా ఖండించింది. జులై 20న విద్యార్థులు, మహిళా నిరసనకారులపై దాడి పాల్పడిన అధికారులను గుర్తించేందుకు ఓ ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ ప్రకటించారు.
దాడుల ఫొటోలు, వీడియోలు ఎవరి దగ్గరున్నా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆయన కోరారు. పోలీసుల దాడికి బాధ్యులైన ప్రతీ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామన్నారు. వెబ్సైట్కు వచ్చే వీడియోలు, ఫొటోలను తమ లీగల్ టీమ్ ద్వారా సమగ్రంగా పరిశీలించి దాడి చేసిన పోలీసులను గుర్తిస్తామన్నారు.
