ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : ఆర్డీఓ రవీందర్ రెడ్డి

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : ఆర్డీఓ రవీందర్ రెడ్డి
  •    సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి

మునిపల్లి, వెలుగు :  ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని లింగంపల్లి,  కంకోల్ గ్రామాల్లోని  ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లింగంపల్లి గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లను కూల్చి వేయించారు.  

అనంతరం కంకల్ గ్రామ శివారులో గల వోక్సాన్​ యూనివర్సిటీలోని 234, 236 గల సర్వే నంబర్​లో ఉన్న 8ఎకరాల 05 ఐదు గుంటల సీలింగ్ భూమిని పరిశీలించారు. అంతకు ముందు మండల కేంద్రమైన  మునిపల్లి  తహసీల్దార్​కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఎక్కడెక్కడ  ప్రభుత్వ భూములు ఉన్నాయి.. ఎన్ని ఎకరాలు ఉన్నాయి..

ఎక్కడైనా ఆక్రమణకు గురయ్యాయా లేదా అనే వివరాలను ఎమ్మార్వోను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్​తెన్ మొళి, డిప్యూటీ ఎమ్మార్వో కృపానందం, సర్వేయర్​వెంకటేశ్వర్లు, ఆర్ఐ రవీందర్,  మాజీ జడ్పీటీసీ అసద్​పటేల్, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు సతీశ్ ఉన్నారు.