సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని గమనించిన గ్యాంగ్‌మెన్‌ ..రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఈ సమయంలో ట్రాక్‌పై దానాపూర్ నుంచి బెంగుళూరు వెళ్తున్న  సంఘమిత్ర ఎక్స్‌‌‌ప్రెస్ ను అధికారులు నిలిపివేశారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. మరమ్మతులు చేపట్టారు. 

పట్టా మరమ్మతుల కారణంగా ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  విరిగిన రైలు పట్టాకు రైల్వే అధికారులు మరమ్మతులు చేసిన తర్వాత ..సంఘమిత్ర ఎక్ర్‌ప్రెస్‌ రైలు బెంగుళూరు బయలుదేరి వెళ్లనుంది.