మేడిపల్లి, వెలుగు : లంచం తీసుకుంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ కార్మికులకు అందించే సబ్బులు, నూనెలు, గ్లాసెస్, చెప్పులను సప్లయ్ చేసిన కాంట్రాక్టర్ ఎన్. శ్రీరాములుకు రూ.10 లక్షల చెక్కు రిలీజ్ అయింది. అదేవిధంగా కార్పొరేషన్లోని వెహికల్స్ రిపేర్కు రూ. 7, లక్షల 39 వేలు, వెహికల్ పంక్చర్లకు రూ. 65 వేలు మొత్తంగా రూ. 8 లక్షల 4 వేలు పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాల్సి ఉంది. ఇందుకు రూ. 10 లక్షల బిల్లుకు 5 శాతం చొప్పున 50 వేలు లంచంగా ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కె. జానకి డిమాండ్ చేసింది.
దీంతో కాంట్రాక్టర్ శ్రీరాములు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం మున్సిపల్ ఆఫీసులో బాధితుడి నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అసిస్టెంట్ సరోజ డబ్బులను తీసుకుని శానిటరీ ఇన్ స్పెక్టర్ జానకికి రూ.20 వేలు ఇచ్చింది. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకుని.. జానకి, సరోజను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.