
హైదరాబాద్సిటీ, వెలుగు: బడంగ్ పేట కార్పొరేషన్ 26వ డివిజన్ తిరుమల నగర్ లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. సంత్సేవాలాల్మహరాజ్ఫొటోకు నివాళులర్పించారు. ఆమెతోపాటు నాయకులు ఏనుగు రాంరెడ్డి, రామిడి రాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రమేశ్ గౌడ్, గిరి ముదిరాజ్, బంజారా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.