డ్రీమ్ గాళ్

డ్రీమ్ గాళ్

పోయినేడు ‘అత్‌‌‌‌‌‌‌‌రంగీరే’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సారా అలీఖాన్.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉతేకర్ డైరెక్ట్ చేస్తున్న ఓ మూవీలో సౌమ్య అనే పాత్ర పోషిస్తోంది. ‘గ్యాస్‌‌‌‌‌‌‌‌లైట్’ అనే చిత్రంలోనూ చేస్తోంది. ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘డ్రీమ్‌‌‌‌‌‌‌‌గాళ్‌‌‌‌‌‌‌‌’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్‌‌‌‌‌‌‌‌లో చేరి అమ్మాయి గొంతుతో మాట్లాడే ఓ కుర్రాడి కథ ఇది. తమతో మాట్లాడేది అమ్మాయే అనుకుని కొందరు కస్టమర్లు హీరోతో ప్రేమలో పడిపోతారు. తమ డ్రీమ్‌‌‌‌‌‌‌‌గాళ్‌‌‌‌‌‌‌‌ని కలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. ఆ తర్వాత అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు రాజ్‌‌‌‌‌‌‌‌ శాండిల్య. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌కి డ్రీమ్‌‌‌‌‌‌‌‌గాళ్‌‌‌‌‌‌‌‌గా సారాని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిసింది. మొదట టీవీ నటి, హిందీ బిగ్‌‌‌‌‌‌‌‌బాస్ 15 విన్నర్ తేజస్వి ప్రకాష్ పేరు వినిపించింది. కానీ అది నిజం కాదని టీమ్‌‌‌‌‌‌‌‌లోని ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్రకి సారా అయితే కరెక్ట్ అని ఫీలైన దర్శకుడు ఆమెతో మాట్లాడి ఫిక్స్ చేశాడట. రణ్‌‌‌‌‌‌‌‌వీర్ సింగ్, ఆలియాలతో కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్‌‌‌‌‌‌‌‌ కహానీ’లో ఒక అతిథి పాత్రలోనూ సారా నటిస్తోందని సమాచారం. మొత్తానికి కంగారు పడకుండా నిలకడగా అడుగులేస్తూ ఒక్కో మంచి ప్రాజెక్టునీ బ్యాగ్‌‌‌‌‌‌‌‌లో వేసుకుంటోంది సారా.